మార్కెట్లోకి నిట్టా జెలాటిన్ వారి గెలిక్సర్ కొలాజన్ పెప్

గురువారం, 27 సెప్టెంబరు 2012 (21:56 IST)
PR
నేటి ఆధునిక జీవితంలో వ్యాయామం తగ్గింది. దీంతో శారీరకంగా మానవుడు సుఖపడిపోవడంతో అధికబరువు, స్థూలకాయం బారిన పడుతున్నాడు. ఒకవైపు కంప్యూటర్ల వద్ద కూర్చుని పనిచేసే ఉద్యోగాలు అధికం కావడం, ఇంట్లో మహిళలు సైతం మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషీన్లు వంటి సాధనాలను ఉపయోగిస్తూ శరీరానికి పని చెప్పడం మానేసిన పరిస్థితి. దీంతో ఇప్పుడు అనారోగ్యం పిలువకుండానే వచ్చేస్తోంది.

మధుమేహం వ్యాధి ప్రబలంగా ఉందని చెప్పుకునే రోజుల నుంచి మోకాళ్లు, వెన్ను నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నొప్పులు భరించలేనివిగా ఉండటంతో కొన్నిసార్లు శస్త్ర చికిత్స సైతం చేయాల్సిన పరిస్థితి. ఐతే ఇలాంటి నొప్పులను మొగ్గ దశలోనే తుంచి ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిట్టా జెలాటిన్ సంస్థకు చెందిన నిపుణులు.

ఈ రుగ్మతలను తొలగించేందుకే ప్రత్యేకంగా వారు ఔషధాన్ని పరిచయం చేశారు. గురువారంనాడు చెన్నైలో గెలిక్సర్ కొలాజన్ పెప్ అనే ఔషధ ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుశీలన్ మాట్లాడుతూ... వెన్ను, మోకాళ్లు తదితర నొప్పులను నయం చేసేందుకు తాము తొలుత కేరళలో ఈ ఔషధంతో 30 మందిపై ప్రయోగం చేశామన్నారు. నొప్పుల బాధతో ఉన్న 30 మందిలో 20 మందికి ఈ మందును ఇచ్చి మిగిలిన 10 మందికి సాధారణ మందులను వాడటం జరిగిందన్నారు. ఐతే కొలాజన్ పెప్ వాడినవారిలో నొప్పులు దాదాపు తగ్గిపోయినట్లు తేలిందన్నారు.

తమ ఉత్పత్తికి భారతదేశంలోనే కాక విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉందన్నారు. తాము ఉత్పత్తి చేస్తున్న ఔషధాల్లో 60 శాతానికి పైగా విదేశాలకే ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదనీ, సమస్య ఉన్నవారు రోజూ ఉదయంపూట 5 గ్రాముల మోతాదులో తీసుకుంటే 3 నెలల్లోపు సమస్య తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం దక్షిణాదిన మొదలుపెట్టి దేశంలోని ఇతర రాష్ట్రాల మార్కెట్లలోనూ విడుదల చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి