ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఐవీఆర్

శనివారం, 31 మే 2025 (14:09 IST)
ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీసులు శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో పూణే లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్టు చేశారు. అందుకోసం వారు సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ పైన, పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ముస్లిం కమ్యూనిటిపైన ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో కొంతమంది ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపించారు. 
 
కాగా సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన అభ్యంతరకర వీడియో ఆన్‌లైన్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కోల్‌కతాలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు దారితీసింది. పోలీసు వర్గాల ప్రకారం, శర్మిష్ఠ పనోలికి లీగల్ నోటీసులు అందజేయడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి, కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది.
 
ఎట్టకేలకు జల్లెడ పట్టి ఆమెను గుర్‌గ్రాంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత పనోలి సోషల్ మీడియాలో బహిరంగంగా క్షమాపణలు చెప్పింది, తాను ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, తన భవిష్యత్ పోస్ట్‌లలో మరింత జాగ్రత్తగా ఉంటానని పేర్కొంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు, సోషల్ మీడియా చర్చ, ప్రజల మనోభావాలపై దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు