వెల్లుల్లి రేకలు... ఐదు
తయారీ విధానం :
ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నెయ్యివేసి స్టవ్పై పెట్టి, కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి బాగా వేయించాలి.
ఆ తరువాత, అందులోనే నానబెట్టి ఉంచుకున్న పప్పు, రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలను కలిపి, తగినంత నీరు పోసి ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే గంగవాయిలు మామిడికాయ పప్పు రెడీ అయినట్లే...! దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.