పెషావర్ ఘటన గుండెను పిండేసింది: అల్ ఖైదా పెషావర్ బ్రాంచ్
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:08 IST)
పెషావర్ ఘటను గుండెను పిండేసిందని పాకిస్థాన్లో అల్ ఖైదా పెషావర్ విభాగం వెల్లడించింది. పాకిస్థాన్లో తెహ్రీక్-ఏ-
తాలిబన్ గ్రూపు పెషావర్ సైనిక పాఠశాలపై దాడిచేసి చిన్నారులను బలిదీసుకోవడాన్ని ఉగ్రవాద సంస్థలు సైతం తప్పుబడుతున్నాయి.
అల్ ఖైదా దక్షిణాసియా విభాగం ప్రతినిధి ఒసామా మెహమూద్ తాలిబన్ల దుశ్చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఈ-మెయిల్ ప్రకటనను మీడియాకు పంపారు. బాధతో గుండె బద్దలైందని పేర్కొన్నారు.
మిలిటెంట్లు భద్రతా బలగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సోదర తాలిబన్ల కిరాతకాన్ని ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు కూడా ఖండించారు. అమాయక బాలలను చంపడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు.