సర్వభూపాల వాహనంపై విహరించనున్న శ్రీవారు!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరి.. తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

నాలుగో రోజైన మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ వాహన సేవ ప్రారంభమవుతుంది. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంపై ఆసీనుడై మాడవీధుల్లో ఊరేగే వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు కొండకు తరలివచ్చారు.

వెబ్దునియా పై చదవండి