ఆ వీడియో డూప్లికేట్.. రంజిత: కాదు ఓరిజనల్.. నిత్యానంద

ఇటీవల తమిళ నటి రంజితతో రాసలీలలు జరిపి వార్తల్లోకెక్కిన స్వామీ నిత్యానందకు ఈ కేసులో ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. ఈ కేసులో నిత్యానందతో తనకు గల సంబంధం గురించి ప్రశ్నించేందుకు తమిళ నటి రంజితను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (సీఐడి) కలిసింది. ఆ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ రంజిత చెప్పినట్లు సీఐడి వర్గాలు తెలిపాయి.

అయితే.. గతంలో సీఐడి డిఐజి చరణ్ రెడ్డి, ఆయన బృందం చెన్నై చేరుకుని రంజిత స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఆ సమయంలో ఆమె మీడియా, పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోవడానికి అమెరికా వెళ్లిపోయారు. నిత్యానంద జైలు నుంచి విడుదలైన తర్వాత సీఐడి ఎదుట హాజరవతాని తన ఈ మెయిల్ మెసేజ్ ద్వారా సీఐడికు తెలిపారు.

కానీ.. విచారణలో మాత్రం ఆమె మాట మార్చారు. ఆ వీడియో ఫుటేజ్ నకిలీదని ఆమె వాదించారు. అయితే నిత్యానంద మాత్రం ఆ వీడియో ఫుటేజ్ ఒరిజినల్ అని అంగీకరించారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక సైతం వీడియో ఫుటేజ్‌లో ఎటువంటి మార్ఫింగ్ చేయలేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తాను పురషుడుని కాదని నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆస్పత్రిలో చేర్పిస్తామని చెప్పగానే.. నిత్యానంద కొత్త పాట మొదలుపెట్టారు. తన 15 మంది శిష్యురాండ్రలతో రాసలీలు జరిపినట్లు ఆయన ధృవీకరించారు.

ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న అమెరికాలో పనిచేస్తున్న వినయ్ భరద్వాజ్ స్వామి రాసలీలను బహిర్గతం చేస్తానని సీఐడికు మాట ఇచ్చారు. సెప్టెంబర్‌లో మైసూర్ చేరుకున్న అనంతరం సీఐడిక తన వాంగ్మూలం వినిపిస్తానని ఈ మెయిల్, ఫోన్ ద్వారా సీఐడికు తెలియజేశాడు. అయితే న్యూ జెర్సీలో ఉన్న నిత్యానంద ఆశ్రమ భక్తులు స్వామికి విరుద్ధంగా సాక్ష్యం చెబితే తనపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరించడంతో భరద్వాజ్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి