రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ మైనర్ చేతిలో లైంగికదాడికి గురైన ఓ ఏడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే మూడో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 15వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్లు మందలించినందుకే బాలిక ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆ బాలిక లైంగికదాడికి గురైనట్లు వెల్లడైంది.