నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా, రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు మంగళవారం అర్థరాత్రి నుంచి చలామణిలో ఉండవని మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు.
పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లను మార్చుకోవడం అంత తేలికకాదు.