విదేశీయుల దృష్టిలో భారత్ 'ల్యాండ్ ఆఫ్ రేప్స్' : అమితాబ్

శనివారం, 17 సెప్టెంబరు 2016 (08:47 IST)
దేశంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాల పట్ల బాలీవుడ్ నటుడు అమితాబ్ కలత చెందారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ భారత దేశాన్ని విదేశీయులు ల్యాండ్‌ ఆఫ్‌ రేప్స్‌ (అత్యాచారాల దేశం)గా అభివర్ణిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఈ మాటలు తలచుకున్నప్పుడల్లా చాలా సిగ్గేస్తోంది. ఈ అపప్రథను తొలగించేందుకు భారతీయులందరూ కృషి చేయాలి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మహిళల భద్రతకు ఢోకా లేకుండా ఉండాలి. భారతను మూడో తరగతి దేశంగా గానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగాగానీ పిలవడం నాకు ఇష్టం ఉండదన్నారు. 
 
అభివృద్ధి చెందిన దేశంగా, ప్రథమ శ్రేణి దేశంగా భారత్‌ను రూపొందించేందుకు అందరూ కృషి చేయాలి. సమాజంలో యువతుల కన్యత్వం గురించి ప్రశ్నించిన సందర్భంలో పురుషుల శీలం గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి వివక్షకు తావులేదని ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి