రైలు జర్నీ : ఈ వెబ్‌సైట్లలో ఫుడ్ ఆర్డర్ చేయొద్దు : భారతీయ రైల్వే శాఖ

గురువారం, 12 అక్టోబరు 2023 (09:21 IST)
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. ప్రయాణ సమయంలో అవసరమయ్యే ఆహార పదార్థాల కోసం వెబ్‌సైట్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఫుడ్ డెలివరీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రైలు ప్రయాణికులను హెచ్చరికలు చేస్తూనే, అనధికారికంగా ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని, ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్న వెబ్‌సైట్ల జాబితాను రైల్వే శాఖ వెల్లడించింది. ఈ - కేటరింగ్ వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని సూచన చేసింది. అలాగే, అనధికారింగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వెబ్‌సైట్ల జాబితాను కూడా ఈ-కేటరింగ్ సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 
 
ఇలాంటి వెబ్ సైట్లలో రైల్ రెస్ట్రో, రైలు మిత్ర, ట్రావెల్ ఖానా, రైల్ మీల్, దిబ్రెయిల్, ఖానా ఆన్‌లైన్, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ-కేటరింగ్, ట్రైన్ మెనూ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్లలో ఎలాంటి ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొద్దని సూచించింది. 
 
అలాగే, ఐఆర్‌సీటీసీ ఈ-కేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా ఆర్డర్ చేయాలని సూచింది. ఈ వెబ్‌సైట్లలోకి వెళ్లి రైలు వివరాలు లేదా స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ను ఎంచుకోవాలని సూచించింది. పే ఆన్ లైన్, క్యాష్ ఆన్ డెలివరీ.. ఈ రెండు ఆప్షన్‌లో డబ్బులు చెల్లించాలని తెలిపింది. అలాగే, 1323 అనే నంబరుకు కాల్ చేసినా లేదా 91-8750001323 అనే వాట్సాప్ నంబరు ద్వారా ఆర్డర్ కూడా చేయొచ్చని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు