భార్య నల్లగా వుందని.. కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు

బుధవారం, 30 ఆగస్టు 2023 (13:04 IST)
భార్య నల్లగా వుందని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. నల్లగా వుందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్పూర్ పురందర్పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి భార్యభర్తలు. ప్రియాంక నల్లగా వుండటంతో శ్యామ్‌కు నచ్చేది కాదు. దీంతో అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఆమెను వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ఇద్దరి గొడవ జరగ్గా.. శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. అంతేగాకుండా ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇవ్వడడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు