గతంలోను సుబ్రహ్మణ్య స్వామి తమిళుల ఆగ్రహం చూడగొన్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక రక్షణ సిబ్బంది తమిళనాడు జాలర్లను, బోట్లను నిర్బంధించాయి. దీనిపై తమిళనాడులోని అన్ని పార్టీలు స్పందించాయి. జాలర్లను, బోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తమిళ జాలర్లను విడిచి పెట్టాలని, బోట్లు ఇవ్వవద్దని చెప్పారు. దీనిపై తమిళ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ గుర్రుగా ఉన్నారు. అంతేగాకుండా ఇప్పటికే మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో బెయిల్ విడుదలైన తరుణంలో తనపై కేసుపెట్టిన సుబ్రహ్మణ్యస్వామిపై కోపంగా ఉన్నారు.