తమిళనాడు అసెంబ్లీ : మేం బయటకు వెళ్లం... మా శవాలే వెళ్తాయి : డీఎంకే సభ్యుల హెచ్చరిక

శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:18 IST)
తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స్పీక‌ర్ ధ‌న్‌పాల్ డీఎంకే సభ్యులను స‌భ‌నుంచి బ‌హిష్క‌రించి, స‌భ‌ను వాయిదా వేశారు. ఈనేప‌థ్యంలో స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌ని డీఎంకే ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు పంపాల‌ని స్పీక‌ర్ నుంచి ఆదేశాలు అందుకున్న మార్ష‌ల్స్ రంగంలోకి దిగి ఆ ప‌నిలో ప‌డ్డారు. 
 
అయితే, స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌బోమ‌ని తెగేసి చెబుతూ డీఎంకే స‌భ్యులు మార్ష‌ల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో మార్ష‌ల్స్‌, డీఎంకే ఎమ్మెల్యేల‌కి మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం మార్షల్స్‌.. డీఎంకే నేత‌ల‌ను బ‌య‌ట‌కు లాగే ప్ర‌యత్నం చేస్తున్నారు. అయితే, డీఎంకే సభ్యులు మాత్రం సభలో నుంచి తాము వెళ్లబోమని, తమ శవాలను మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుందని మార్షల్స్‌ను హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి