మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభం రూ.3,806 కోట్లు

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్ అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2010 డిసెంబర్‌ 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికానికి ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్ నికరలాభం 13.45 శాతం వృద్ధి చెంది 3,806.49 కోట్ల రూపాయలకు చేరుకుంది.

గత యేడాడి ఇదే కాలానికి బ్యాంకు ఆర్జించిన నికరలాభం 3,354.94 కోట్ల రూపాయలు. మొత్తం ఆదాయం 14.7 శాతం పెరిగి 32,231.45 కోట్ల రూపాయల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికం) 36,966.87 కోట్ల రూపాయలకు చేరుకన్నట్టు ఆ బ్యాంకు ఛైర్మన్ ఓపీభట్ శనివారం ప్రకటించారు.

ప్రధానంగా లాభాలు భారీగా పెరగడంతో నికర వడ్డీ ఆదాయం పాత్ర కీలకంగా ఉందన్నారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 40 శాతం వృద్ధి చెంది 8,782 కోట్ల రూపాయల నుంచి 12,306 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. తాము స్వచ్ఛందంగా రానిబాకీల కోసం ప్రొవిజనింగ్‌ను పెంచకపోయి ఉంటే లాభం 32.31 శాతం వృద్ధి చెంది 3,280 కోట్ల రూపాయలకు చేరేదని ఎస్‌బిఐ చైర్మన్ ఒపి భట్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి