తండ్రీ- కూతుళ్లకు అశ్రు నివాళులు

కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకున్న ఆ తండ్రి హృదయం... కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి ముక్కలై ఆగిపోయింది. కానరాని లోకాల్లోనూ కనుపాపలా చూసుకుంటానని కూతురుని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది.

కిడ్నాప్‌కు గురై శవమై తేలిన విజయవాడ చిన్నారి నాగ వైష్ణవి, ఆమె తండ్రి పలగాని ప్రభాకర్లకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రభాకర్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రజలు, సన్నిహితులు తరలి వచ్చారు.

రాష్ట్రమంత్రులు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇతర నాయకులందరూ తండ్రీ-కూతుళ్లకు నివాళులర్పించారు.

వెబ్దునియా పై చదవండి