రాష్ట్రాన్ని విభజించడం అంత సులభం కాదు: ఎంపీ కావూరి

బుధవారం, 5 జనవరి 2011 (15:33 IST)
రాష్ట్రాన్ని విభజించడం అంత సులభమైన విషయం కాదని తాను భావిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంత తేలికైన పని కాదని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైనే తాము ప్రణబ్‌తో చర్చించినట్టు తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యునిగానే ఆయనతో భేటీ అయ్యామన్నారు. ఈనెల ఆరో తేదీన ప్రస్తావించాల్సిన అంశాలపైనే చర్చిస్తామన్నారు.

అలాగే, నివేదిక ప్రతులను అందజేసిన తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కొంత సమయం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. దీనికి ప్రణబ్ కూడా ఏకీభవించారన్నారు. నివేదిక అందుకున్న తర్వాత పూర్తిగా అధ్యయనం చేసి అభిప్రాయం వెల్లడించాలని కోరారినట్టు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి