లోక్పాల్ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అడ్డుపడ్డాయని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు హైదరాబాద్లో జరుగనున్నాయి.
దీనిపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై లోక్పాల్ బిల్లు రాకుండా అడ్డుపడ్డాయని ఆరోపించారు. ఉపఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అభిప్రాయం అడిగే ముందు కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు తమ వైఖరిని వెల్లడిస్తే తెలంగాణపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందన్నారు.