తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ముందడుగు: కాంతం

FILE
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టుగానే తెలుస్తోంది. తెలంగాణ ప్రజాసంఘాల జెఎసికి, విద్యార్ధి జెఎసికి ఎఐసిసి అధినేత్రి సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారన్నసమాచారం తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం తెలిపారు.

ఈ నెల పన్నెండున తమకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారని, తాము ఢిల్లీ వెళ్లి ఆమెను కలుస్తామని కాంతం చెప్పారు.

తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కోరుతున్నామని, అదే విషయాన్ని రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు తెలియచేశామని చెప్పారు. తెలంగాణ వస్తే బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక తెలంగాణ రావాలని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి