విభజన తప్పదంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయండి: ఏరాసు

FILE
విభజన అనివార్యమైతే, రాష్ట్ర విభజన తప్పదంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాల్సిందేనని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణతోనూ, కోస్తాంధ్రతోనూ కలపలేరన్నారు. గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు తెలిపారు.

రాష్ట్రం విడిపోవడం రాయలసీమ వారికి కూడా ఇష్టంలేదు. విభజన అనివార్యమైతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని రాయలసీమ వారు డిమాండ్ చేస్తున్నారు. తమని కోస్తాంధ్రతో కలపవద్దని వారు కోరుతున్నారు. మంత్రి ఏరాసు కూడా అదేవిధంగా డిమాండ్ చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి