హరికృష్ణ అల్టిమేటం.. అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారా లేక.. ఒంటరిగా...

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:47 IST)
File
FILE
ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు హరికృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అల్టిమేటం జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా తనకు సీటు కేటాయిస్తే సరేసరి లేదంటే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగక తప్పదని హెచ్చరించినట్టు సమాచారం. దీంతో దిగివచ్చిన చంద్రబాబు.. నందమూరి హరికృష్ణకు కృష్ణా జిల్లా నూజివీడు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

నిజానికి చంద్రబాబుపైన హరికృష్ణ బుధవారం బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. హరికృష్ణ సన్నిహితులతో చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. హరికృష్ణ సోదరుడు, హీరో బాలకృష్ణకు హిందూపురం సీటును టిడిపి టిక్కెట్ కేటాయించిన విషయం విదితమే.

ఇదిలావుండగా హరికృష్ణ మాత్రం తనకు కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును గతంలోనే కోరానని చెప్పారు. కాని తనకు టిక్కెట్ కేటాయించకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి