టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, యువనేత నారా లోకేష్ ఆదివారం మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చేపట్టిన రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ప్రచార రథంపై నుంచి ప్రసంగించడానికి లోకేష్ సిద్ధమవుతుండగా, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కారుపైకి వాటర్ బాటిళ్లు, మామిడి కాయలు, బీరు సీసాలు విసిరారు.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది లోకేష్కు రక్షణగా నిలిచారు. టీఆర్ఎస్ కార్యకర్తలు విసిరిన సీసాల్లో ఒకటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్ కర్నూలు లోక్సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బక్కని నర్సింహులుకు తగిలింది. లోకేష్ వాహనంపై బీరుసీసాలు విసిరిన తెరాస కార్యకర్తను గుర్తించిన తెదేపా మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుణ్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని కారులో బీరు సీసాలు ఉండటం గుర్తించి రెచ్చిపోయిన తెదేపా కార్యకర్తలు ఆ కారుకు నిప్పుపెట్టారు.