ప్రధాని కాకుండా నరేంద్ర మోడీని ఎవరూ అడ్డుకోలేరు.. చంద్రబాబు

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (18:47 IST)
WD
భాజపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి, తెదేపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... ఈ సభ ప్రచార సభలా లేదని, నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార సభలా ఉన్నదని అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.

ఈ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం, భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్ రాష్ట్రంలాగే దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తారని బాబు అన్నారు. అవినీతిని ప్రక్షాళన చేయగలిగే సత్తా నరేంద్ర మోడికి ఉన్నదన్నారు. చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టుల పూర్తి చేసుకోవాలంటే నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి