టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె కిడ్నాప్: రెబెల్స్ పనేనా?

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (09:58 IST)
File
FILE
నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కేతావత్ బిల్యా నాయక్ కుమార్తె హారిక (12) గురువారం హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో కిడ్నాప్‌కు గురైంది. గురువారం ఉదయం ఇంట్లోని వరండాలో చదువుకుంటున్న హారిక కనిపించకపోవడంతో కిడ్నాప్‌కు గురైందని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిల్యా నాయక్‌కు ఒక కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. వీరు హైదరాబాదులోని బిఎన్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. హారిక ఎనిమిదో తరగతి హైదరాబాద్‌లో చదువుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం బిల్యా నాయక్, ఆయన భార్య అనిత దేవరకొండలో ఉన్నారు.

గురువారం ఉదయం నుంచి హారిక కనిపించక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని దేవరకొండలో ఉన్న బిల్యాకు తెలిపారు. ఆయన హుటాహుటినా హైదరాబాద్ వచ్చారు. తన కుమార్తెను అపహరించారని మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక తన కుమార్తెను ప్రత్యర్థులే అపహరించారని బిల్యా నాయక్ ఆరోపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి