బాలకృష్ణకు హిందూపురం టిక్కెట్ ఎలా ఇస్తారు : చిరంజీవి

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (12:10 IST)
File
FILE
సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు హిందూపురం టిక్కెట్‌ను ఎలా కేటాయిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ... హిందూపురంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, అక్కడి ముస్లిం నేతలను కాదని బాలకృష్ణకు ఎలా ఇస్తారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తాను సామాజిక న్యాయం చూశానన్న చిరు... టికెట్ల కేటాయింపులో తమ పార్టీ ఆ న్యాయాన్ని పాటించిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు బలం ఉంటే స్వతంత్రంగా పోటీ చేయకుండా బీజేపీతో కలసి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. దారులు వేరైనా పవన్ కళ్యాణ్‌ది, తనది ఒకటే గమ్యమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టినట్లు పవన్‌ను పెట్టే పరిస్థితి చిరంజీవి హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి