విమాన ప్రమాదంలో 72 మంది మృతి: ఇరాన్ మీడియా

ఇరాన్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. బోయింగ్ 727 రకానికి చెందిన ఇరాన్ ఎయిర్ టెహ్రాన్‌కు ఈశాన్య దిక్కున ప్రతికూల వాతావరణం కాలంగా కూలిపోయినట్టు ప్రకటించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 105 మంది ప్రయాణికుల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడినట్టు పార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

వెస్ట్ అజెర్బజాన్ ప్రొవిన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన సమాచారం మేరకు 70 మంది మరణించారని, 32 మంది గాయపడినట్టు ఇరానియన్ రెడ్ క్రిస్కెంట్ డిప్యూటీ హెట్ హైదర్ హైదరి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలను ప్రొవిన్షియల్ కార్నర్స్ కార్యాలయానికి తరలించినట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి