ఆ అంశంపై న్యాయనిపుణలతో చర్చించిన తర్వాతే నిర్ణయం!!

2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను విచారించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషీ అన్నారు.

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కుంభకోణం విచారణకు అవసరమైతే తాను కూడా పీఏసీ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోషీకి ప్రధాని లేఖ రాసిన విషయం తెల్సిందే. దీనిపై జోషీ స్పందిస్తూ.. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ప్రధాని ఆఫర్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి