మార్చ్ వద్దన్న కేసీఆర్ మద్దతంటుండు... గిట్ల తెలంగాణ షురూ గలేదా..?!!

బుధవారం, 26 సెప్టెంబరు 2012 (21:30 IST)
FILE
సుమారు నెల రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ కాంగ్రెస్ పెద్దల నుంచి బుధవారంనాడు వచ్చిన మాటలు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో కుండబద్ధలు కొట్టినట్లు కనబడుతోంది. ఈ నేపధ్యంలోనో ఏమోగానీ, కేసీఆర్ బుధవారంనాడు తిన్నగా తెలంగాణ మార్చ్ శాంతియుతంగా జరగాలంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

ట్యాంక్ బండ్‌పై సాగర్ హారాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నడం సమంజసం కాదనీ, తక్షణమే తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలంటూ చెప్పేశారు. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే మార్చ్ తేదీనాటికి తెరాస చీఫ్ హైదరాబాదు వచ్చేసి మార్చ్ లో పాల్గొంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది.

మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఢిల్లీ వెళుతున్నానని చెప్పి మరీ వెళ్లిన కేసీఆర్ ఇన్నాళ్లు సాధించేదేమిటన్నది ప్రశ్నగా మిగిలింది. తెలంగాణా మార్చ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. మరి ఆలోపు కాంగ్రెస్ హైకమాండ్ మనసు మార్చుకుని ఏదయినా ప్రకటన చేస్తుందా...? చూడాలి.

వెబ్దునియా పై చదవండి