శివానుగ్రహం కోసం శైవక్షేత్రాలను సందర్శించుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా ప్రదోష కాలంలో శివునిని దర్శించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో నందీశ్వరాభిషేకం, శివలింగాభిషేకాన్ని కళ్లారా వీక్షించే వారికి కార్యసిద్ధి. ఇలా శనిప్రదోష సమయంలో శివునిని దర్శించుకునేవారికి ఐదేళ్లపాటు ఆలయాన్ని దర్శించుకున్న ఫలితం లభిస్తుందని విశ్వాసం. శివానుగ్రహం కోసం శైవులు 8 రకాలైన వ్రతాలను ఆచరించాలని సూచించివున్నారు. ఈ వ్రతాలను ఆచరించిన వారికి శివానుగ్రహం తప్పకుండా చేకూరుతుంది.
* పాశుపత వ్రతం
* అష్టమి వ్రతం - వైశాఖ పూర్వాభాద్ర అష్టమి రోజున ఆచరించాలి.
* కేదార గౌరీ వ్రతం - దీపావళి రోజున ఆచరించే వ్రతం.