స్టాక్ మార్కెట్ : 20 పాయింట్ల నష్టంతో బీఎస్ఈ సూచీ

బాంబే స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ లాభాలతో ఆరంభమైనప్పటికీ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 20 పాయింట్ల మేరకు నష్టపోయింది. మరోవైపు.. ప్రపంచ మార్కెట్‌లు మిశ్రమంగా ఉన్నాయి.

యాపిల్‌ కంప్యూటర్స్‌ నుంచి ఈవాళ మినీ ఐప్యాడ్‌ మార్కెట్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా యాపిల్‌ షేరు ధర 4 శాతం పెరిగి 634 డాలర్లకు చేరింది. మరోవైపు యాహూ షేరు ధర కూడా 4 శాతం పెరిగింది.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. షాంఘై, జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సింగపూర్‌ సూచీ లాభాల్లో కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి