ఢిల్లీ ఐటీఎఫ్ టోర్నీలో యూకీ బాంబ్రీ

FileFILE
ఫ్లోరిడాలోని ప్రతిష్టాత్మక నిక్ బోలిటరీ అకాడెమీలో రెండు వారాల శిక్షణ అనంతరం భారత్ చేరిన టెన్నిస్ యువకెరటం యూకీ బాంబ్రీ నేటి నుండి ప్రారంభం కానున్న ఐటీఎఫ్ పురుషుల ఫ్యూచర్స్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ టోర్నీ ఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో జరుగుతుంది.

ఈ ఏడాది ఏప్రిల్-మేనెలలో జరిగిన ఐటీఎఫ్ టైటిళ్లను బాంబ్రీ గెలుచుకున్నాడు. అయితే ఈ నెల ప్రారంభంలో జరిగిన వింబుల్డన్ జూనియర్ ఓపెన్ టోర్నీలో పాల్గొనలేదు. అదలా ఉంచితే ఐటీఎఫ్ టోర్నీలో పాల్గొంటున్న సందర్భంగా బాంబ్రీ విలేకరులతో మాట్లాడుతూ, ఇక్కడ రెండు టోర్నీలు ఆడిన తర్వాత తాను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్నాడు.

అయితే బోలిటెరీ శిక్షణ అకాడెమీలో మాత్రం తాను ప్రతిరోజు రెండు లేదా మూడు సెట్ల మ్యాచ్ ఆడుతున్నానని వివరించాడు. కాగా, నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఈ 16 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెన్ జూనియర్ ఛాంపియన్ బాంబ్రీ ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు అశ్విన్ కుమార్‌తో తలపడనున్నాడు.

వెబ్దునియా పై చదవండి