లక్ష్మణ్ రిటైర్మెంట్ గురించి నాకు తెలియదు : ఎంఎస్.ధోనీ
బుధవారం, 22 ఆగస్టు 2012 (17:49 IST)
File
FILE
హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్.లక్ష్మణ్ రిటైర్మెంట్ గురించి తనకు ముందుగా తెలియదని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు. అలాగే.. తనను లక్ష్మణ్ విందుకు ఆహ్వానించారంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
లక్ష్మణ్ రిటైర్మెంట్ వ్యవహారంపై ధోనీ బుధవారం హైదరాబాద్లో స్పందించారు. లక్ష్మణ్ ఎందుకు రిటైర్ అయ్యారో తనకు తెలియదన్నారు. అలాగే, లక్ష్మణ్ తనను డిన్నర్కు ఆహ్వానించలేదని, సచిన్, సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్లను మాత్రమే పిలిచాడని చెప్పుకొచ్చాడు.
ఈనెల 23వ తేదీ నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగనున్న టెస్ట్ సిరీస్కు ముందు హైదరాబాద్ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెల్సిందే. ఈ సీనియర్ బ్యాట్స్మెన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కెప్టెన్ ధోనీతో పాటు.. బోర్డు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.