మెగాస్టార్ చిరంజీవి హీరోగా జెమిని ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై యంగ్ డైరక్టర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ‘శంకర్దాదా జిందాబాద్’ చిత్రం ఆడియో ఈనెల నాలుగో తేదీన విడుదలచేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యిందని, ఓ పాటను హైదరాబాద్లోనూ, రెండు పాటలను ఇటీవల ఆస్ట్రేలియాలోనూ చిత్రీకరించామని న్మిరాత తెలిపారు.
యువతరాన్ని తన సంగీత బాణీలతో ఉర్రూతలూగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలున్నాయి. వీటిని సుద్దాల అశోక్తేజ, చంద్రబోస్, భాస్కరభట్ల, సాహితి రచించారని ఆయన చెప్పారు. ఈ పాటల ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా జూలై నాలుగవ తేదీ విడుదల చేయబోతున్నామని నిర్మాత వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మోడల్ కరిష్మా కోటక్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.
గాంధీగా దిలీప్ ప్రభావర్కర్ నటిస్తున్నారు. శంకర్దాదా సహచరుడుగా శ్రీకాంత్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, శరత్బాబు, సదా, రోహిత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఆర్ట్: అశోక్, కాస్ట్యూమ్్స: కృష్ణ, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, నిర్మాణం: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్, దర్శకత్వం: ప్రభుదేవా.