సిద్ధార్థ్ - నిత్యామీనన్‌ల '180' ఆడియో విడుదల

గురువారం, 21 ఏప్రియల్ 2011 (18:46 IST)
WD
సిద్దార్థ్‌, ప్రియా ఆనంద్‌, నిత్యమీనన్‌జంటగా నటించిన చిత్రం '180' ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ప్రసాద్‌ ఐమాక్స్‌లో జరిగింది. ముఖ్య అతిథులు డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్‌ ఆడియోను విడుదల చేయగా, '180 ద సినిమా.కామ్‌' వెబ్‌సైట్‌ను రామ్‌, సునీల్‌ ఆవిష్కరించారు.

ముందుగా చిత్రం గురించి చిత్ర దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ..నా వయస్సు వాళ్ళు దర్వకత్వానికి విశ్రాంతి ఇస్తున్న సమయంలో నేను ఆరంభించాను. 'ఈ వయసికరాదు' అనేది కాప్షన్‌. అసలు '180' అంటేఏమిటి? అనిచాలామంది అడుగుతున్నారు. చక్కటి రొమాంటిక్‌ సినిమా. ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రస్ట్‌ కలుగుతుంది. పూర్తయ్యాక కథ మిమ్మల్ని వెంటాడేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని డిజిటల్‌లో చిత్రీకరించాం. కలర్‌ కరెక్షన్‌ హాలీవుడ్‌లో పేరుపొందిన కెవిన్‌ షా చేశాడు అని చెప్పారు.

నిత్యమీనన్‌ మాట్లాడుతూ, అలా మొదలైంది తొలి సినిమా హిట్‌ అయింది. రెండవది కూడా హిట్‌ అవుతుందనే నమ్మకముంది. చక్కటి సంగీతభరిత చిత్రమిది అని అన్నారు.

గీత రచయిత వనమాలి మాట్లాడుతూ, ఏవో సినిమాకు పాటలు అడిగారు. రాద్దాములే అనుకున్నాను. కానీ దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు చూసి ఇంట్రెస్ట్‌ కల్గింది. తమిళ్‌కు సంబధం లేకుండా పాటలు రాయమన్నారు. కొన్ని షాట్స్‌ తెలుగులోవి ఉపయోగించారు. రెండూ వేర్వేరుగా షూట్‌ చేశారు. దర్శకుడు, కెమెరామెన్‌ పనితీరు అద్భుతగా ఉంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు శరత్‌ వాసుదేవన్‌తో నేను చేసిన రెండవ సినిమా. సంగీతపరంగా హిట్‌ అవుతుందనే నమ్మకముందని చెప్పారు. 'ఇది సినిమాకాదు. చక్కటి అనుభూతి కల్గించే కావ్యంగా' వసంత వాసుదేవన్‌ పేర్కొన్నారు.

సిద్దార్థ్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం దేవుడు ఇచ్చిన వరం. దర్శకుడు జయేంద్ర చిన్నతనం నుంచి తెలుసు. 8వ సంవత్సరంలోనే మూడు వందల రూపాయల నుంచి ఆయన దగ్గరర పనిచేశాను. ఏడేళ్ళనాడు మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాను. తెలుగు ప్రేక్షకులు జీవితాన్ని ఇచ్చారు. తెలుగు హీరోగా పేరు పొందడం ఆనందంగా ఉంది. ఇది వైవిధ్యమైన సినిమా. ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను.

వనమాలికి రచయితగా తమిళభాషపై మంచి పట్టు ఉంది. చక్కటి సాహిత్యాన్ని అందించాడు అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ, సిద్ధార్థ్‌ను ఫోన్‌ చేసి ఆడియో ఎప్పుడు అని అడిగాను. ఫలానా రోజుఅన్నాడు. ఏదో పిలిచాడు పోతే పోలా అనుకున్నాను. తీరా ట్రైలర్స్‌ చూశాక మనసు మార్చుకున్నాను. తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, జయేంద్ర 1980 నుంచి తెలుసు. ఎన్నో యాడ్స్‌ చేశారు. సినిమా కూడ అలాగే ఉంటుదనుకున్నాను. ఇప్పుడు ఈ ట్రైలర్స్‌ చూశాక కాస్త బాధేసింది. ఎందుకంటే నేను ఇలాంటిదే నాగచైతన్యతో తీశాను. ఈ సినిమాను డిజిటల్‌లో తీశారు.

ఇంకా శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి. సురేష్‌బాబు, రామ్‌, హీరోయిన్లు మాట్లాడుతూ.. చిత్ర విజయాన్ని కాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి