దర్శకుడు, హీరో ఒకే మాట మీద వుంటే ఆ సినిమా ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పటివరకు చిన్నపాటి డిస్టబెన్స్ వున్నా.... పూరీ, ఎన్టిఆర్ ఒకేమాట మీద వున్నట్లు సమాచారం. దీనికి కారణం నిర్మాత బండ్ల గణేష్... ఆయన తీసిన సినిమాలు సక్సెస్, ఫెయిల్యూర్ అయినా.. ఎక్కువగా నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లేనని తెలిసింది.
గోవిందుడు అందరివాడేలో... పెట్టిన పెట్టుబడికి లాభం రాకపోగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి వచ్చిందట. దీంతో ఎన్టిఆర్ సినిమాను వారికి ఇవ్వడానికి ఓకే అన్నాడు. అందుకుగాను హీరో, దర్శకుడిని పారితోషికంలో తగ్గించుకోమని విజ్ఞప్తి చేసినట్లు భోగట్టా. దీనికివారు ససేమిరా అన్నట్లు వార్తలు వచ్చాయి.
అవసరమైతే సినిమా నిర్మాతగా బండ్ల గణేష్ను తప్పించి... వారే మోసేట్లుగా ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. కాగా, ఇది కూడా ఓ వ్యాపార టెక్నిక్గా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతుంది. కాజల్ హీరోయిన్.