మల్లీశ్వరి చిత్రంలో పెళ్లికాని ప్రసాద్ పాత్రను పోషించిన వెంకటేష్.. అదే పేరుతో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఇది పూర్తిస్థాయి వినోదాత్మకంగా వుండేలా చూస్తున్నారు. హుద్హుద్ తుఫాన్ సహాయార్థం పలు కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వెంకటేష్ చేయనున్నాడు.
ఆ ప్రోగ్రామ్లో కాజల్ కూడా పాల్గొననుంది ఈ స్కిట్ వినోదాత్మకంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అలీ, బ్రహ్మానందంలు ఇందులో పాల్గొననున్నారు. 'మేము సైతం' అని పేరు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇదొక హైలైట్గా వుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.