కోర్టు నుంచి బయటకు రాగానే వెక్కివెక్కి ఏడ్చిన అమలాపాల్.. భర్త నుంచి భరణం వద్దట!

ఆదివారం, 7 ఆగస్టు 2016 (15:53 IST)
రెండేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ - దర్శకుడు విజయ్‌లు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారిద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిద్దరు శనివారం కోర్టుకు కూడా హాజరయ్యారు. వారిద్దరి తరపున వారివారి న్యాయవాదులు విడాకుల పిటీషన్‌లను దాఖలు చేశారు. 
 
తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్ కొద్దినెలలుగా సమస్యలతో సతమతమవుతోందట. విజయ్‌తో కలిసుండటం కుదరదన్న భావనకు అమలాపాల్ వచ్చేసిందని సమాచారం. ఇప్పటికే దీనిపై విజయ్ కూడా స్పష్టతనిచ్చాడు. అమలాపాల్‌తో భేదాభిప్రాయాలున్న మాట నిజమేనని అంగీకరించాడు. 
 
ఇక్కడ మరో విశేషమేమిటంటే భర్త నుంచి భరణం లాంటిదేమీ అమలాపాల్ కోరలేదట. కోర్టు నుంచి బయటికొచ్చే సమయంలో అమలాపాల్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిందట. కన్నీళ్లు పెట్టుకుని బాధపడిందట. ఏదేమైనా అమలాపాల్ వైవాహిక జీవితానికి ఇంత తొందరగా తెరపడటం నిజంగా బాధాకరం.

వెబ్దునియా పై చదవండి