శరత్ బాబు ఆరోగ్యం విషమం : ఏఐసీ ఆస్పత్రి వర్గాల వెల్లడి

గురువారం, 4 మే 2023 (08:36 IST)
సీనియర్ హీరో శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 71 సంవత్సరాల శరత్ బాబుకు ఐసీయూ ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్స అందిస్తుంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనైట్టు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా, గత మార్చి నెలలో అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. తొలుత బెంగుళూరుకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడ నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
శరత్‌బాబు మృతి చెందినట్టు కొన్ని వెబ్‌సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో పలు రకాలైన వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలపడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని, వాటిని నమ్మవద్దని శరత్ బాబు సోదరి కోరారు. ఆయన కోలుకుని తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు