ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు భాగ్యనగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు పీకల్లోతు నీటిలో నిండిపోవడం.. ఇళ్లలోకి నీళ్లు చేరడం..అపార్ట్ మెంట్స్లోని సెల్లార్లు పూర్తిగా నీటిమయం కావడంతో నగరవాసులు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడుతోంది. దీంతో కొందరు దాతలు పాలు, డ్రింకింగ్ వాటర్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిస్తున్నారు.
ఇతర ప్రాంతాలలో కష్టాల్లో చిక్కున్న ప్రజలను ఆదుకోవడానికి సినీనటుడు రానా తన వంతు కృషి చేస్తున్నాడు. వరద బాధితులకు బట్టలు, చెప్పులు, దుప్పట్లు, ఆహార పదార్థాలు విరాళంగా ఇవ్వాలని సోషల్మీడియా ద్వారా వేడుకున్నాడు. దాతల నుంచి వాటిని తీసుకోవడానికి రామానాయుడు స్టూడియో గేటు 24 గంటలు తెరిచే ఉంటుందని వెల్లడించాడు.
హైదరాబాద్లో వరద బాధిత ప్రాంతాలయిన అల్వాల్లో 2000, జవహర్నగర్లో 400, మాదాపూర్లో 500, సికింద్రాబాద్లో 400ల ఆహార పదార్థాల ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. దాతలు తమ వద్దకు వచ్చి సాయం చేస్తే వాటిని వాలెంటీర్ల ద్వారా వరద బాధితులకు అందిస్తామని పేర్కొన్నారు.