18న శర్వానంద్ - దిల్ రాజుల 'శతమానం భవతి' ఆడియో విడుదల

సోమవారం, 12 డిశెంబరు 2016 (22:47 IST)
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.
 
ఈ చిత్రం ఆడియోని ఈ నెల 18న హైదరాబాద్‌లో వైభవంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. 
 
"శతమానం భవతి తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 18 న ఆడియోను విడుదల చేస్తున్నాము. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆడియోని అందించారు. జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి