పాత రాతి కట్టడంతో ఉన్న ఈ దేవాలయంలో మన్నారు రాజగోపాలస్వామి రాతి విగ్రహం లభ్యం కావడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అర్చకులు, వైష్ణవ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాలు ఓ గొప్ప దేవాలయాన్నివెలుగులోకి తెచ్చాయని అంటున్నారు.