నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి... భారీ విగ్రహ శంకుస్థాపన

గురువారం, 14 ఏప్రియల్ 2016 (07:45 IST)
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల కాంస్య విగ్రహ నిర్మాణానికి పూనుకోనుంది. ఈ చారిత్రక ఘట్టానికి ఐమ్యాక్స్‌, డా.కార్స్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ మధ్యలో ఉన్న పార్టీ జోన్‌లో గల 2 ఎకరాల స్థలం వేదిక కానుంది. 
 
గురువారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు భూమిపూజ చేస్తారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఉదయం 10:30కు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్‌ భవన నిర్మాణ సముదాయంలో అంబేద్కర్‌ టవర్స్‌ నిర్మాణానికి, ఆ తర్వాత యూసు్‌ఫగూడలో భాగ్యారెడ్డివర్మ (సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌) నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేస్తారు. 
 
ఎన్టీఆర్‌ గార్డెన దగ్గర 125 అడుగుల ఎత్తైన విగ్రహానికి శంకుస్థాపన చేసి, భూమిపూజ అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. దీనికోసం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకల సందర్భంగా హైదరబాద్ నగరంలో వాహనరాకపోకల్ల స్వల్పమార్పులు చేశారు.

వెబ్దునియా పై చదవండి