శేష జీవితం దువ్వాడ శ్రీనివాస్‌తోనే.. మాధురి (Video)

ఠాగూర్

సోమవారం, 7 అక్టోబరు 2024 (20:16 IST)
ఇకపై తన శేషజీవితాన్ని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే గడుపుతానని డ్యాన్స్ టీచర్ మాధురి అంటున్నారు. ఆమె సోమవారం దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రతియేటా బ్ర‌హ్మోత్సవాల‌కు తిరుమ‌ల‌ వ‌స్తానని, గ‌తంలో నా డ్యాన్స్ టీమ్‌తో మాడ‌వీధుల్లో ప్రోగ్రామ్స్ చేయించినట్టు చెప్పారు. ఇక‌పై దువ్వాడ శ్రీ‌నివాస్‌తోనే క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను, అందుకే ఇద్ద‌రం క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్నట్టు చెప్పారు. తన శేషజీవితం దువ్వాడ శ్రీనివాస్‌తోనే అని చెప్పారు. 
 
ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తన ఆస్తుల‌న్నీ భార్యాపిల్ల‌ల‌కు రాసేశాను.. అయినా పిల్ల‌ల బాధ్య‌త తన మీద ఉందన్నారు. ఎన్నిక‌ల్లో తన కోసం మాధురి కొంత న‌గదు ఖ‌ర్చు చేశారనీ, అందుకే కొంత ఆస్తి ఆమె పేర రాసినట్టు చెప్పారు. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల‌ మాధురికి కూడా అన్యాయం జ‌రిగింది.. అందుకే ఆమెకు తాను అండ‌గా ఉన్నట్టు చెప్పారు. 

 

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి

నా ఆస్తుల‌న్నీ భార్యాపిల్ల‌ల‌కు రాసేశాను.. అయినా పిల్ల‌ల బాధ్య‌త నా మీద ఉంది

ఎన్నిక‌ల్లో నా కోసం మాధురి కొంత న‌గదు ఖ‌ర్చు చేశారు.. అందుకే కొంత ఆస్తి ఆమె పేర రాశాను

ఈ గొడ‌వ‌ల వ‌ల్ల‌ మాధురికి కూడా అన్యాయం జ… pic.twitter.com/eBYHUOw3Yv

— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు