అనంతపురంలో ఓ భర్త అత్యంత పాశవికంగా తన భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తన చెయ్యి కోసుకుని పరారయ్యాడు. అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్లో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న యువతి మీద ఆమె భర్త దాడి చేసి కలకలం సృష్టించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దాంతో ఆమె గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోయింది.
భార్య గొంతు కోసిన సదరు భర్త తన చేతిని కూడా కోసుకున్నాడు. ఈ సంఘటన చూసి జనం గుమిగూడటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.