రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అద్దాల మేడ నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కొనుగోలు చేయడం తప్ప మామూలుగా ఆయన ఎన్నికల్లో గెలవలేరని ఎద్దేవా చేశారు.
ఎలా కొన్నాం, ఎంతమందిని కొన్నాం, ఎంత సంపాదించాం అనుకుంటూ చంద్రబాబు బతుకుతారనీ, కానీ ఎలా బతికామన్నది ముఖ్యమని బాబు తెలుసుకోవాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ దాని గురించి మాట్లాడటం లేదన్నారు. రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, నలుగురికే ఎక్స్గ్రేషియా చెల్లించి మిగిలినవారి విషయాన్ని పట్టించుకోవడంలేదన్నారు.