నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విజయసాయి దుమ్ము దులిపిన మంతెన

శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:27 IST)
'అవినీతి కేసుల్లో సచ్చుబొచ్చలో సద్దికూడు తిన్న నువ్వా అశోక్  గజపతి రాజును విమర్శించేది ఏ2 రెడ్డి’ అంటూ' ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదుకోవడంలో అశోక్ గజపతిరాజు ముందుంటే.. లూఠీకి ఏ2 రెడ్డి ముందున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధులైన అశోక్ గజపతిరాజును లూటీ చేసే నీచులు విమర్శించడం దుర్మార్గమని విమర్శించారు.  సింహాచలం భూముల్లో ఎందుకు తలదూరుస్తున్నావని నిలదీశారు.

లక్షలాది కుటుంబాలకు భూదానం అశోక్ గజపతిరాజు చేస్తే.. మెడమీద కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని ఏ2 గుంజుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు కాస్త విశాఖరెడ్డిగా మారిపోయిందన్నారు.  నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విశాఖలో వచ్చి పడ్డావని గుర్తుంచుకో అని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రకు పట్టిన తెల్ల దరిద్రం ఏ2 అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇచ్చి అశోక్ గజపతిరాజ వేల కుటుంబాలను ఆదుకుంటే.. తమరొచ్చి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. రాజకుటుంబీకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంతెన సత్యనారాయణ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు