'నేను ఒంటరిగా ఉంటున్నా... ఎవరైనా నాతో గడపాలనుకుంటే'... కరపత్రాలు పంచిన దుర్మార్గుడు

మంగళవారం, 8 నవంబరు 2016 (08:41 IST)
ఓ మహిళను అభాసుపాలు చేసేందుకు ఓ వ్యక్తి చేయకూడని పని చేసి జైలుకెళ్లాడు. 'నేను భర్త తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్నా. ఎవరైనా నాతో ఓ రాత్రి గడపాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు' అని పేర్కొంటూ ఫోన్‌నెంబరుతో సహా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజాంపేటలో నివాసముండే ఓ మహిళ భర్త ఉండగానే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. అయితే, ఆమె భర్త నాలుగు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. భర్త చనిపోయాక ఆ మహిళ సన్నిహితంగా ఉన్న వ్యక్తిని అలక్ష్యం చేయడంతో ఆగ్రహంతో అతడు జీడిమెట్లలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మహిళపై అసభ్యమైన పదజాలంతో కరపత్రం ప్రిటింగ్‌ చేయించాడు. 
 
ఆ కరపత్రాలను మహిళ నివాసముండే ప్రాంతంలో పంపిణీ చేశాడు. కరపత్రాలను చూసిన ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని సదరుమహిళకు తెలుపడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అసలు విషయం రాబట్టారు. నిందితుడిపైనా ప్రిటింగ్‌ప్రెస్‌ నిర్వాహ కుడిపైనా 354, 509, 501 సెక్షన్ల కింది కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి