ముంబైలోని డోమ్లో జరిగిన మొట్టమొదటి బడ్ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్లో దక్షిణ భారత నటుడు, అథ్లెట్ అరవింద్ కృష్ణ సంచలనం సృష్టించారు. దిశా పటాని, బాద్షా, రణ్విజయ్ సింఘా, వరుణ్ సూద్ వంటి జాతీయ దిగ్గజాలు పాల్గొన్న ఈ ఆటలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నటుడిగా అరవింద్ కృష్ణ నిలిచారు. మూడో నంబర్ జెర్సీ ధరించి కోర్ట్లో అడుగు పెట్టారు. గత ఏడాది మోకాలి గాయంతో బాధ పడిన అరవింద్ ఈ సారి మరింత శక్తివంతంగా తిరిగి వచ్చారు. అరవింద్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.