ఒకవైపు తెలంగాణ రైతులు విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటుంటే ఆంధ్ర ప్రభుత్వం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వడం లేదని, టిడిపి ఎమ్మెల్యే ఆంధ్ర ప్రభుత్వానికి మద్దతుగా సభలో మాట్లాడుతున్నాడని కెసిఆర్ రేవంత్పై మండిపడ్డారు.
అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడేందుకు లేవగా అధికారపక్షం సభ్యులు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. మంత్రి హరీశ్రావు లేచి విద్యుత్పై మాట్లాడిన దానికి ఆధారాలు ఉంటే చూపాలి లేదా క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పేంత వరకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని అన్నారు. ఈ అంశంపై మంత్రి జగదీశ్రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాకే మాట్లాడాలని అన్నారు.