ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం అందిస్తున్న సహాయం కనిపించడం లేదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఒక అవగాహనతో ముందుకెళుతున్న బీజేపీ, టీడీపీ మధ్య తెగతెంపులే జరిగితే ఏపీకి జరిగే నష్టం మామూలుగా ఉండదని హెచ్చరించారు.