బలముంటే జూనియర్ ప్రచారమెందుకు: అల్లు

మంచంమీద ఉన్న వ్యక్తితో ప్రచారం చేయించడమేనా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అంటూ సినీనటుడు అల్లు అర్జున్ ధ్వజమెత్తారు. పడకమీద ఉన్న వ్యక్తితో ప్రచారం చేయిస్తున్నారంటే టీడీపీకి ఉన్న బలం ఏపాటిదో తెలుస్తోందని అల్లు అర్జున్ ఎద్దేవా చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరులో ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలో ఉన్న మునెమ్మకు మద్దతుగా ప్రచారం చేపట్టిన సందర్భంగా అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తేజలో ఆ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడవలేని పరిస్థితిలో పడకమీద ఉన్న ఎన్టీఆర్‌కు స్క్రిప్టు రాసిచ్చి తమకు కావల్సినట్టు మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.

గతంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2లకే కిలో బియ్యం పథకాన్ని అటకెక్కించిన వ్యక్తి ఇప్పుడు నెలకు రెండువేలు ఇస్తానంటే ప్రజలు నమ్మబోరంటూ వారు విమర్శించారు. ఒకవేళ టీడీపీ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టినా కొన్నాళ్లు కొనసాగించి అటుపై ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఆపేస్తారంటూ దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి